Anupama: సైబ‌ర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన అనుపమ!

  • February 21, 2022 / 10:58 AM IST

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. యంగ్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చదువుకుంటున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో ఇక మధ్యలోనే చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చేసింది. ఆ తరువాత నటిస్తూ.. డిగ్రీ పూర్తి చేసింది. మళయాళంతో పాటు తెలుగులో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ ఓ షాక్ తగిలింది. కొన్నిరోజుల క్రితం అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్ ను కొందరు హ్యక్ చేశారు.

Click Here To Watch

అందులో కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసిన అనుపమ షాకైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అయితే కొందరు అనుపమకు కామెంట్స్ రూపంలో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ కు అనుపమ ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో కామెంట్స్ రావడం తగ్గాయి. ఈ విషయాలను అనుపమ స్వయంగా వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు సోషల్ మీడియా హ్యాకింగ్ వలన కలిగిన ఇబ్బందుల గురించి వెల్లడించింది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన ’18 పేజెస్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus