Anushka48: ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనుష్క?

  • November 8, 2021 / 03:53 PM IST

స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా తర్వాత పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా పి మహేష్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గతంలో వార్తలు వైరల్ కాగా ఆ సినిమా ఆగిపోలేదని తాజాగా ప్రకటన వెలువడింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకక్కనుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుష్క ఈ సినిమాలో వైవాహిక వ్యవస్థపై ఏ మాత్రం నమ్మకం లేని యువతి పాత్రలో కనిపించనున్నారు.

తన కంటే చిన్న వ్యక్తితో డేటింగ్ చేసి గర్భం దాల్చడం లాంటి వ్యవహారాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అనుష్క ఈ సినిమాలో మరోసారి ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా అనుష్క పెళ్లి చేసుకోబోతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాలకు అనుష్క దూరమయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో నిజం లేదని అనుష్క చెప్పకనే చెప్పేశారు. వరుసగా కాన్సెప్ట్ సినిమాలలో నటిస్తున్న అనుష్క ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus