ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనుష్క..!

  • June 27, 2019 / 05:50 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ డైరెక్షన్లో ‘సైలెన్స్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ‘సై రా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్లో గాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయమైందని.. అందుకే ఆమె నడవలేని పరిస్థితిలో ఉందని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ప్రచారం జరిగింది.

ఈ వార్తల పై తాజాగా అనుష్క తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ” నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సియాటిల్ లో సంతోషంగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తన పై వచ్చిన రూమర్లన్నిటికీ ఈ విధంగా చెక్ పెట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus