Anushka: అనుష్క లేటెస్ట్ ఫోటో వైరల్..షాక్ లో ఫ్యాన్స్..!

  • May 13, 2021 / 07:55 PM IST

గతేడాది అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ రెండేళ్ళ తరువాత.. అనుష్క నుండీ వచ్చిన సినిమా కావడంతో ఆ సినిమాని ఎక్కువ మందే చూసారని చెప్పాలి. ఇదిలా ఉండగా.. అనుష్క లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె లుక్ ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

దానికి కారణం అనుష్క మళ్ళీ లావవడం వల్లే అని స్పష్టమవుతుంది. ‘నిశ్శబ్దం’ సినిమాలో సన్నగా కనిపించిన అనుష్క.. మళ్ళీ ఇప్పుడు బరువు పెరగడం ఆమె అభిమానులు నిరుత్సాహపరిచింది. అయితే అనుష్క లుక్ పై ఎటువంటి ట్రోలింగ్ జరగడం లేదు. చాలా రోజుల తరువాత అనుష్క కనిపించడంతో.. ఆమె అభిమానులు ‘లాక్ డౌన్ కాబట్టి .. స్వీటీ ఇంట్లోనే ఉండడం వలన ఈ లుక్ లోకి మారింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘సైజ్ జీరో’ చిత్రం కోసం వెయిట్ పెరిగిన అనుష్క అప్పటి నుండీ ఎంత జాగ్రత్త పడినా ఫిట్నెస్ ను మెయింటైన్ చేయలేకపోతోంది. అందుకే ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదని స్పష్టమవుతుంది. అనుష్క త్వరలో ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతుంది. ‘యూవీ క్రియేషన్స్’ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ప్రధాన పాత్ర పోషిస్తూండటం విశేషం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus