ప్రభాస్‌ సిన్మాలో సీత క్యారెక్టర్‌పై అనుష్క కామెంట్‌

  • September 29, 2020 / 04:29 PM IST

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి నేషనల్‌, ఇంటర్నేషనల్‌ వైడ్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. అలాగే, అనుష్కకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. కపుల్‌గా వీళ్ళిద్దరికీ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. వాళ్ళకు ఓ శాడ్‌ న్యూస్‌. బిల్లా, మిర్చి, బాహుబలి సిన్మాల్లో ప్రభాస్‌, అనుష్క మధ్య కెమిస్ట్రీ సిల్వర్‌ స్ర్కీన్‌ మీద కేక పుట్టించింది. అభిమాన జోడీ మరోసారి కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలనుకున్న వాళ్ళకి ‘ఆదిపురుష్‌’ రూపంలో ఓ న్యూస్‌ వచ్చింది.

రామాయణాన్ని బేస్‌ చేసుకుని బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ తియ్యనున్న ఆ సిన్మాలో సీతగా అనుష్క యాక్ట్‌ చెయ్యవచ్చని వచ్చిన న్యూస్‌ ప్రభాస్‌, అనుష్క అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. స్వీటీ అలియాస్‌ అనుష్క మాత్రం అటువంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అనుష్క లీడ్‌ క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేసిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్‌ 2న రిలీజ్‌ అవుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ మీడియాతో జూమ్‌ యాప్‌లో ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌ జరిగింది. అప్పుడు ‘‘మీరు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో సీత క్యారెక్టర్‌ చెయ్యనున్నట్టు న్యూస్‌ వచ్చింది.

అందులో నిజమెంత?’ అని అనుష్కను అడగ్గా… ‘‘లేదండీ! నా వరకూ ఏదీ రాలేదు. ఆ టాపిక్‌ అసలు రాలేదు. మా మధ్య డిస్కషన్లు జరగలేదు’’ అని చెప్పారు. దీనిబట్టి ప్రస్తుతానికి ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌, అనుష్కను కపుల్‌గా చూసే అవకాశం లేదని చెప్పుకోవాలి. రెండు నెలలుగా న్యూ స్టోరీలు వింటున్నానని అనుష్క చెప్పారు. రెండు కథలు తనను ఆకట్టుకున్నాయని ఆవిడ అన్నారు. కొత్త సిన్మాలను ప్రొడ్యూసర్లు అనౌన్స్‌ చేస్తారని, డైరెక్టర్లు ఎవరనేదీ ప్రొడ్యూసర్లే చెప్తారని అనుష్క చెప్పారు. అప్పటివరకు తాను చెప్పనని ఆమె చెప్పారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus