మళ్ళీ అనుష్క దగ్గరకే వచ్చిన క్రేజీ ఆఫర్..!

  • April 20, 2019 / 04:59 PM IST

తెలుగు తమిళ భాషల్లో నయన్,అనుష్క లు అగ్ర కథానాయికలుగా చాలామణీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనుష్కను సంప్రదించగా ఆమె తిరస్కరించిందనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అదే అవకాశానికి ఓకే చెప్పిందట. క‌ల్కి ర‌చించిన `పొన్నియ‌న్ సెల్వన్‌` అనే పుస్త‌కం ఆధారంగా మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ నటీనటులతో పాటూ మిగిలిన బాషా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన న‌టులు కూడా నటించబోతున్నారు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, విక్ర‌మ్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌యం ర‌వి, కీర్తి సురేష్ వంటి క్రేజీ న‌టులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇదే క్రమంలో న‌య‌న‌తారను కూడా ఎంచుకున్నారు. అయితే ఆమె ప్ర‌స్తుతం ర‌జినీకాంత్‌, విజ‌య్ సినిమాలతో బిజీగా ఉండ‌డం వ‌ల్ల డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదట. ఇందుకోసమే ఆమె స్థానంలో అనుష్క‌ను తీసుకున్నారని తెలుస్తోంది. న‌య‌న‌తార కంటే ముందు అనుష్క‌కే ఈ ఆఫర్ వచ్చిందట కానీ నో చెప్పింది దీంతో న‌య‌న‌తారను తీసుకున్నారు. కానీ ఇప్పుడు నయన్ తప్పుకోవడంతో మళ్ళీ అనుష్క‌నే సంప్రదించారు. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఆఫర్ చేయడంతో అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus