సెన్సార్ రిపోర్ట్ తో ఫుల్ సాటిస్ఫాక్షన్ తో నిశ్శబ్దం టీం..!

  • May 27, 2020 / 07:30 PM IST

రిలీజ్ పై ఎటువంటి సమాచారం లేకుండానే సెన్సార్ కి వెళ్లి నిశ్శబ్దం టీం షాక్ ఇచ్చింది. మరి వీరి రిలీజ్ ప్లాన్ ఏమిటన్నది అర్థం కాలేదు. ఇక నిశ్శబ్దం సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పలు బాషలలో విడుదల అవుతుంది. ఇక సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం. కాగా ప్రతి సినిమాకు సెన్సార్ అనంతరం సదరు అధికారులు సినిమాపై ఓ రిపోర్ట్ ఇస్తారు.

ఒక్కోసారి అది పాజిటివ్ గా మరికొన్ని సార్లు నెగెటివ్ గా వస్తుంది. మరి నిశ్శబ్దం మూవీ చూసిన సెన్సార్ అధికారులు పాజిటివ్ గా స్పందించారట. మూవీ చాలా బాగుంది, విజయం సాధించడం ఖాయం అని అన్నారట. సెన్సార్ సభ్యుల మాటలు చిత్ర యూనిట్ లో విశ్వాసం నింపాయని తెలుస్తుంది. అందుకే వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి ఈ చిత్రం తేవాలన్నది ప్లాన్ అట. మరి నిశ్శబ్దం మూవీకి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే మరలా అనుష్క ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

వరుసగా హారర్ చిత్రాలతో విజయాలు అందుకుంటున్న అనుష్క గత మూవీ భాగమతి హారర్ థ్రిల్లర్ కావడం విశేషం. ఇక అనుష్క కెరీర్ లో బెస్ట్ మూవీగా ఉన్న అరుంధతి హారర్ మూవీనే. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రచయిత కొనా వెంకట్ నిర్మిస్తున్నారు. అంజలి, షాలిని పాండే కీలక పాత్రలు చేస్తున్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus