Kathi Mahesh: సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్!

  • July 14, 2021 / 07:25 PM IST

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరణంపై పలువురు ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మృతిలో కుట్ర కోణం ఉందని మహేష్ మృతి ప్రమాదం కాదని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ కారు ఒకవైపు నుజ్జునుజ్జు అయినా డ్రైవర్ ఎలా సేఫ్ అయ్యారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గతంలో వైద్యులు, కత్తి మహేష్ కుటుంబ సభ్యులు ప్రాణాపాయం లేదని కూడా వెల్లడించారు.

కత్తి మహేష్ పై గతంలో కూడా దాడులు జరిగాయని మందకృష్ణ మాదిగ ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ కత్తి మహేష్ మృతిపై విచారణకు ఆదేశించడం గమనార్హం. రంగంలోకి దిగిన పోలీసులు కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తర్వాత ఏం జరిగిందనే విషయాల గురించి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కత్తి మహేష్ తండ్రి ఓబులేషు కూడా ప్రమాదంపై అనుమానాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని కత్తి మహేష్ తండ్రి కోరారు. ప్రభుత్వం విచారణ జరిపించి న్యాయం చేయాలని ఓబులేషు కోరారు. పోలీసుల విచారణ వల్ల కత్తి మృతి విషయంలో మిస్టరీ వీడుతుందేమో చూడాల్సి ఉంది. పోలీసుల విచారణ తర్వాత కత్తి మహేష్ మృతికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయేమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus