మహేష్ విషయంలో జరిగిన తప్పు, ఎన్టీఆర్ విషయంలో జరగనివ్వను!

  • January 4, 2020 / 01:33 PM IST

తమిళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న దర్శకుడు ఏ.ఆర్.మురుగ దాస్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘దర్బార్’. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 9న తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ మహేష్, ఎన్టీఆర్ ల పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

మురుగదాస్ మాట్లాడుతూ.. ” ‘స్పైడర్’ సినిమాతో మహేష్ గారిని తమిళ ప్రేక్షకులకి పరిచయం చెయ్యాలి అని అనుకున్నాను. కానీ తెలుగు ప్రేక్షకులకి ఆయనో స్టార్ హీరో అనే విషయాన్ని మర్చిపోయాను. ఇక ఎన్టీఆర్ తో నేను ఓ సినిమా చేయబోతున్నాను అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. చాలా కాలం క్రితమే ఆయన్ని కలిసి ఓ కథ వినిపించాను. కానీ అది ఫైనల్ కాలేదు. ఆయనతో సినిమా చేసే అవకాశం గనుక వస్తే.. ‘ఓ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కచ్చితంగా చేస్తా’. మహేష్ గారి విషయంలో జరిగిన తప్పు.. ఎన్టీఆర్ గారి విషయంలో జరగనివ్వను.” అంటూ చెప్పుకొచ్చాడు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus