మహేష్ సినిమాలో ఇంటెలిజెంట్ విలన్ గా అరవింద స్వామి?

  • June 22, 2020 / 12:23 PM IST

మహేష్ బాబు విలన్ పై టాలీవుడ్ లో పెద్ద చేర్చే నడుస్తుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట మూవీలో విలన్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. దీనితో కొంచెం ఫేమ్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ ని తీసుకోవాలని దర్శకుడి ఆలోచన. దీనికోసం సౌత్ లోని అన్ని పరిశ్రమలలోని ప్రముఖ నటులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. మొదటగా సర్కారు వారి పాట మూవీ కోసం కన్నడ హీరో సుధీప్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

ఆ తరువాత మరో కన్నడ హీరో ఉపేంద్ర పేరు కూడా వినిపించింది. కాగా వీరిద్దరిలో ఎవరిని కూడా మేకర్స్ ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. తాజాగా మరో టాలెంటెడ్ నటుడు పేరు వినిపిస్తుంది. తమిళ నటుడు అరవింద స్వామిని ఈ మూవీలో విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. కథ మరియు అందులో విలన్ పాత్రకు ఆయన చక్కగా సరిపోతారని దర్శకుడి ఆలోచన అని తెలుస్తుంది. గతంలో అరవింద స్వామి తని ఒరువన్ అనే మూవీలో ఇంటెలిజెంట్ విలన్ రోల్ చేశాడు.

ధ్రువ పేరుతో తెలుగు రిమేక్ రాగా అందులో కూడా అరవింద స్వామి చేయడం జరిగింది. సర్కారు వారి పాట మూవీలో విలన్ పాత్ర అలాంటి షేడ్స్ లో ఉంటుందని వినికిడి. దీనితో అరవింద స్వామిని దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus