“అరవింద సమేత” సినిమాను ప్రదర్శనలు ఆపేయాలని డిమాండ్

  • October 22, 2018 / 12:19 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” మూవీ ఈనెల 11 న రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ తొలి వీకెండ్ లోనే 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దసరా సెలవులు కావడంతో వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి 151 కోట్ల మార్కును అధిగమించింది. ఈ కలక్షన్స్ తో చిత్ర బృందం ఆనందంలో ఉంటే.. విమర్శలు తలనొప్పిగా మారాయి. కొన్ని రోజుల క్రితం రాయలసీమ యువత ఈ సినిమాలో తమ ప్రాంతాన్ని, తమ ప్రాంత ప్రజలను కించపరిచేలా చూపించారని..

అందుకే ప్రదర్శన నిలిపివేయాలని కోరారు. ఆ సమస్య సద్దుమనగానే ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించే ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. మరి ఇతని విమర్శలను చిత్రబృందం ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus