బాలీవుడ్‌ మీడియాపై విరుచుకుపడ్డ అర్జున్

  • April 12, 2018 / 01:37 PM IST

బాలీవుడ్ వెబ్ సైట్లు తమ గురించి ఇష్టానుసారం రాస్తుండడంతో బోనీ కపూర్‌ మొదటి భార్య కొడుకు అర్జున్‌ కి కోపం వచ్చింది. జాగ్రత్తగా రాయమని సలహా ఇచ్చారు. అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో బోనీ కపూర్‌ తన ఇద్దరు కూతుళ్లను మొదటి భార్య పిల్లలకు దగ్గర చేశారు. ఇప్పుడు వీరంతా ఒక కుటుంబంలా కలిసిపోయారు. బుధవారం రాత్రి బోనీ కపూర్‌ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అర్జున్‌ ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు బయట ఉన్న ఫొటోగ్రాఫర్లు జాన్వి ఫొటోలను తీశారు. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ఫొటోలు అసభ్యంగా ఉన్నాయని ఓ బాలీవుడ్‌ మీడియా వెబ్‌సైట్‌ వార్తలు రాసింది.

ఈ వార్త అర్జున్‌ కంట పడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ కళ్లు ఇలాంటి విషయాలపైనే దృష్టి పెడుతున్నందుకు సిగ్గుపడండి. మన దేశంలో అమ్మాయిలను ఈ విధంగా చూస్తున్నామని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సిగ్గుగా ఉంది” అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం జాన్వీ మరాఠీలో సూపర్ హిట్ సాధించిన సైరత్ మూవీకి రీమేక్ అయిన ధడక్ లో నటిస్తోంది. శశాంక్ ఖైతాన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus