చెల్లెలి జోలికొస్తే ఊరుకోనని హెచ్చరించిన అన్న

  • June 6, 2018 / 10:27 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి మరణించిన తర్వాత బోని మొదటి భార్య పిల్లలైన అర్జున్, అన్షులా కపూర్‌లు జాన్వీ, ఖుషీలను సొంత చెళ్లెల్లా చూసుకుంటున్నారు. వారిని ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోవడం లేదు. తాజాగా జాన్వీ డ్రస్ పై కామెంట్ చేసిన ఓ దిన పత్రికకు అర్జున్ కపూర్ వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్ గా జాన్వి షార్ట్ డ్రెస్‌ను వేసుకొని ఓ ఫంక్షన్ కి హాజరైంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చూసినా నెటిజన్లు ఫ్యాయింట్ వేసుకోవడం మరిచిపోయిందని కామెంట్స్ చేసుకున్నారు. దీన్ని ఆధారం చేసుకొని ఓ పత్రిక వారు “ఆమె ఏదో వేసుకోవడం మరిచిపోయిందనే శీర్షికతో ప్రచురించారు.

ఇది అర్జున్ కంట పడటంతో సోషల్ మీడియా వేదికపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పెద్ద పత్రిక విమర్శకులకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను తగ్గించడం వలన విమర్శకులను తగ్గించిన వారు అవుతారని సూచించారు. ఓ విధంగా హెచ్చరించారు. ఈ సంఘటనతో తన చెల్లిలిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ అర్జున్ చెప్పకనే చెప్పాడు. జాన్వి కపూర్ ‘ధడక్’ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ సినిమా జూలై 20న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లో జాన్వీ బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus