మెట్టు దిగనంటున్న అరవింద్ స్వామీ

  • January 2, 2017 / 12:31 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభ కలిగిన నటీనటులున్నారు. కానీ మన డైరక్టర్లు, నిర్మాతలు ఇతర భాషా నటులను పరిచయం చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలా వారు నటించిన సినిమాలు హిట్ అవుతుండడంతో సదరు నటీనటులు ఫోజులు కొడుతున్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం అరవింద్ స్వామీ చేరారు.  ఈ తమిళ నటుడు తెలుగులో తొలి సారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాలో విలన్ గా నటించారు. ఆయన నటన చిత్ర విజయానికి దోహదం చేసింది. దీంతో అరవింద్ స్వామికి కోలీవుడ్, టాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి స్వామి మైండ్ గేమ్ ఆడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. అతన్ని సంప్రదించిన తెలుగు నిర్మాతలతో తాను తెలుగు సినిమాలు చేయనని డైరక్ట్ గా చెబుతూ .. తన మేనేజర్ ద్వారా ఎక్కువ మొత్తం పారితోషికం ఇస్తే నటిస్తారనే సమాచారం చేరవేయిస్తున్నారని  అందరూ చెప్పుకుంటున్నారు. సరే కోటి  రూపాయులైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నిర్మాతలకు అరవింద్ స్వామి మేనేజర్ చెప్పిన రెమ్యునరేషన్ విని గుండె పగిలిపోతోంది. ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా కే ఇంత ఫోజు కొడుతున్న తమిళనటుడుని చూసి అందరూ “కొంచెం తగ్గితే మంచిది” అంటూ సలహా ఇస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus