Aswani Dutt: టాలీవుడ్‌లో నెపోటిజం హీరోలపై అశ్వనీదత్‌ ఫైర్‌!

  • August 12, 2022 / 02:28 PM IST

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం గురించి చాలా ఏళ్లుగా చర్చ సాగుతూనే ఉంది. సినిమా పరిశ్రమలో వారసులు అనే అంశం చర్చకు వచ్చినప్పుడల్లా హీరోల గురించే మాట్లాడుతుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కూడా వారసత్వం హీరోల గురించి ఘాటైన కామెంట్‌ చేశారు. ఏ ఒక్కరి పేరు చెప్పకుండా.. కేవలం ఆకారం, రూపు గురించి మాట్లాడి నెపో కిడ్స్‌ గురించి మాట్లాడారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన ఎవరి గురించి అన్నారు అంటూ చర్చలు కూడా సాగుతున్నాయి.

అశ్వనీదత్‌ ముగ్గురు తనయలు స్వప్న, ప్రియాంక, స్రవంతి.. సినిమా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ అంటూ వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. నిర్మాతగా మీ కూతురు స్వప్న బెటరా? లేక మీరే బెటరా అని అశ్వనీదత్‌ను అడిగితే.. ‘‘నా కూతురు నా కంటే గొప్ప నిర్మాత అయితే నాకు అంతకుమించి కావాల్సింది ఏముంటుంది. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు’’ అంటూ ఓ తండ్రిగా చెప్పిన ఆయన అక్కడితో ఆగకుండా.. కొడుకుల గురించి మాట్లాడారు.

‘మీకు ముగ్గురు కూతుళ్లు కదా.. కొడుకులు లేరని బాధ అనిపించలేదా? అని అడిగితే.. ‘‘నాకు కొడుకులు లేరు అనే ఫీలింగ్‌ వచ్చే ముందు.. వాడెవడో ఒకడు విచిత్రంగా పుట్టి.. నన్ను హీరోను చేయమంటే ఉన్న డబ్బులు మొత్తం పోయేవి కదా అనిపిస్తుంది’’ అంటూ వారసత్వం హీరోలు, వారిని హీరోలను చేయడం గురించి మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. అశ్వనీదత్‌ ఎవరి గురించి ఈ మాటలు అన్నారు అనే చర్చ నడుస్తోంది.

ఇండస్ట్రీలోనే ఉంటూ వారసత్వం గురించి ఇలాంటి కామెంట్లు ఏంటి అనే మాట ఓ వైపు వినిపిస్తుంటే.. ఎందరో నట వారసుల్ని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇలాంటి మాట ఎందుకు అన్నారు అనేది మరో వైపు వినిపిస్తున్న మాట.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus