బాలకృష్ణకు నచ్చిన మహేష్ స్టోరీ

  • February 23, 2017 / 11:45 AM IST

పూరి జగన్నాథ్ బేసిక్ గా రచయిత కావడంతో కథలను బాగా చెప్పగలరు. ఆ నేర్పుతోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా చేశారు. ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణను తన స్టోరీతో ఫ్లాట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. వరుసగా అపజయాలతో సతమవుతున్న పూరి నుంచి బడా హీరోలు దూరంగా ఉంటే బాలయ్య ఎలా కనెక్ట్ అయ్యారా? అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఏడాది క్రితం  ‘జన గణ మన’ అనే సినిమా స్టోరీ మహేష్ బాబు కి పూరి జగన్నాథ్ చెప్పారు.  ప్రిన్స్ బాగుంది అన్నారు గానీ, డేట్స్ గురించి చెప్పకపోవడంతో ఆ కథను వెంకటేష్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఒకే అన్నా బడ్జెట్ సెట్ కాక వదిలేశారు.

ఆ స్క్రిప్టు ని దుమ్ముదులిపి, బాలకృష్ణకు తగ్గట్లు మార్పులు చేసి రీసెంట్ గా వినిపించారు. అందులో రాజకీయానికి సంబంధించిన అనేక సీన్లు బాగున్నాయని, ఆ కథ తన రాజకీయ భవిష్యత్తుకు దోహదం చేస్తుందని భావించి బాలయ్య ఒకే చెప్పినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ పొలిటికల్  స్టోరీలతోనే వస్తున్నారు. ఈ సమయంలో తాను కూడా రాజకీయ నేపథ్య స్టోరీ తోనే రావాలని ఆలోచిస్తున్నారంట. అయితే దీనిని కె ఎస్ రవికుమార్ సినిమా తర్వాత చేయాలా?, ముందే చేయాలా ? అనే డైలమాలో నందమూరి హీరో ఉన్నట్లు  సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus