Balakrishna: బాలయ్య బోయపాటి సినిమా కోసం పని చేస్తున్న తేజస్విని.. కానీ?

  • June 10, 2024 / 06:46 PM IST

నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య (Balakrishna) పుట్టినరోజున కూడా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే గత కొంతకాలంగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారతారని వార్తలు వినిపించగా ఆ వార్తలే ఎట్టకేలకు నిజమయ్యాయి. బాలయ్య బోయపాటి (Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతున్న అఖండ (Akhanda) సీక్వెల్ కు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో తేజస్విని సమర్పకురాలిగా మారుతున్నారంటే ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబో అనగానే అభిమానులకు సింహా (Simha), లెజెండ్ (Legend) , అఖండ సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడం గమనార్హం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో కాగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావించినా కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు మాత్రం రాలేదు. బాలయ్య రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ లో నటించే నటీనటులెవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

ఈ సినిమా టైటిల్, ఇతర క్రేజీ అప్ డేట్స్ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విషయంలో బోయపాటి శ్రీను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus