అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన పూరి జగన్నాథ్

  • March 23, 2017 / 08:19 AM IST

కథకు ఒక్కసారి ఒకే చెబితే చాలు… ఇక మళ్లీ దాని గురించి బాలకృష్ణ ఆలోచించరు. దర్శకుడు చెప్పింది చేసుకొంటూ మెరుపు వేగంతో దూసుకుపోతుంటారు.  పూరి జగన్నాథ్ స్టైల్ కూడా సేమ్ టు సేమ్. స్క్రిప్టుని పక్కాగా సిద్ధం చేసుకొని స్పష్టతతో సెట్స్ పైకి వెళతారు. చకచకా సినిమాని పూర్తి చేస్తారు. అందుకే ఆయన సినిమాలు అనుకొన్న సమయానికే విడుదలవుతుంటాయి. సో వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ సూపర్ ఫాస్ట్ గా నిర్మితమవుతోంది. గత గురువారం (16 వతేదీ) నుంచి మొదటి షెడ్యూల్ మొదలెట్టారు. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో బాలకృష్ణ, ఫైటర్లపై యాక్షన్ సీన్ నిన్నటితో పూర్తి చేశారు.

షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న సమయానికే పేకప్ చెప్పి ఆవిషయాన్ని ట్విట్టర్లో డైరక్టర్ వెల్లడించారు. అంతే కాదు ఈ ఫైట్ నందమూరి అభిమానులకు చాల బాగా నచ్చుతుందని హామీ కూడా ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 29న ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారంటీ అని పూరి, బాలయ్య స్పీడ్ చూస్తుంటే తెలుస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus