చిరు-జగన్ భేటీకి రానని చెప్పిన బాలయ్య.. కారణం అదే

  • June 6, 2020 / 01:53 PM IST

ఈనెల 9న ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలవనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సమాచారం ఉండగా చిరంజీవి అధ్యక్షతన సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు, షూటింగ్స్ అనుమతి, వైజాగ్ లో చిత్ర పరిశ్రమ ఏర్పాటు, అభివృద్ధి వంటి అనేక విషయాలు చర్చించనున్నారు. కాగా ఈ మీటింగ్ కి బాలయ్య హాజరుకావడం లేదు. ఆయనకు ఈ సమావేశం గురించి తెలుపడంతో పాటు ఆహ్వానం పంపగా ఆయన రానని చెప్పారు.

ఈనెల 10వ తేదీన బాలకృష్ణ తన షష్ఠి పూర్తి జరుపుకోనున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర ప్రముఖులు హాజరు కానుండగా ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకల కారణంగా రాలేనని ఆయన చెప్పారు. కాగా బాలయ్య పుట్టిన రోజు వేడుకను సాకుగా చూపి ఈ మీటింగ్ అవైడ్ చేశారని తెలుస్తుంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జరిగిన కొన్ని సమావేశాలకు బాలయ్యను పిలవలేదు. చిరు అధ్యక్షతన జరిగిన సదరు సమావేశాలకు తనను పిలవకపోవడం పై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూములు పంచుకోవడానికి వీరు సమావేశం అవుతున్నారా అని కొంచెం ఘాటైన విమర్శలు చేశారు. దీనితో పరిశ్రమ వర్గాలలో వివాదం రాజేసుకుంది. జగన్ తో సమావేశానికి అయినా బాలయ్యను పిలిచి దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే బాలయ్య రావడం కుదరదని చెప్పి, తను ఈ విషయంలో కోపంగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus