బాలయ్య వలన మనసు మార్చుకున్న నితిన్..!

  • October 17, 2019 / 09:13 PM IST

నితిన్ ఏడాదిన్నర నుండీ సినిమాలు ఏమీ చేయలేదు. గతేడాది నితిన్ సినిమాలు ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్ లు గా మిగిలాయి. అంతకు ముందు చేసిన ‘లై’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని.. ఎంతో కసిగా ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుములు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘సితారా ఎంటెర్టైన్మెట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు మంచి హిట్ అందుకుంటేనే కానీ నితిన్ మళ్ళీ ఫామ్లోకి రావడం కష్టం.

కాబట్టి సోలో రిలీజ్ కావాలి. మొదట ‘భీష్మ’ సినిమాని డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారు. డిసెంబర్ లో సాయి తేజ్ ‘ప్రతీరోజూ పండగే’, ‘జార్జ్ రెడ్డి’ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా సరే నితిన్ భయపడకుండా డిసెంబర్ కే రావడానికి రెడీ అయ్యాడట. అయితే ఇప్పుడు బాలకృష్ణ – కె.ఎస్. రవికుమార్ సినిమా కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతుంది. పెద్ద హీరో కాబట్టి ఎక్కువ థియేటర్లు బాలయ్య సినిమాకి దక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే ఇప్పుడు ‘భీష్మ’ ని 2020 ఫిబ్రవరిలో ‘మహా శివరాత్రి’ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నితిన్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus