‘టైగర్ నాగేశ్వరరావు’ గా బెల్లంకొండ శ్రీనివాస్.. ఇది ఫిక్స్..!

  • February 7, 2019 / 12:13 PM IST

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అటు తరువాత ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయకా’ ‘సాక్ష్యం’ ‘కవచం’ ఇలా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయి శ్రీనివాస్. సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. డ్యాన్సులు, ఫైట్లతో దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం తేజ డైరెక్షన్లో ‘సీత’ చిత్రం చేస్తున్న బెల్లంకొండ… త్వరలో ఓ బయోపిక్‌ లో నటించబోతున్నాడట. ‘ఇండియన్ రాబిన్‌హుడ్‌’ గా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటించబోతున్నాడట బెల్లంకొండ.

స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించేవాడు. టైగర్ నాగేశ్వరావు పేరు చెబితేనే పోలీసులు ఆందోళన చెందేవారట. అయన గురించి జనం కూడా కథలు కథలుగా చెప్పుకొనేవారట. అలాంటి గజదొంగ బయోపిక్ ని తెరకెక్కించేందుకు గత కొంత కాలం నుండీ ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ కి దగ్గుబాటి రానా ని అనుకున్నప్పటికీ… రానా కి కమిట్మెంట్స్ ఉండడంతో.. ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడట. దాంతో ఇప్పుడు బెల్లంకొండ చేరాడట. రాజ్ తరుణ్ తో ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వంశీకృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ ‘రాచ్చసన్’ అనే తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించబోతున్నాడట. ఇప్పటి వరకు భారీ హిట్ సాధించలేక పోవడంతో.. ఇప్పుడు రీమేక్ ని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయిన వెంటనే బెల్లంకొండ.. ఈ బయోపిక్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus