కవచం నష్టాల విషయంలో డిస్ట్రిబ్యూటర్ తో గొడవ!

  • December 17, 2018 / 12:54 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన “కవచం” ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కనీసం పది కోట్ల రూపాయలు కూడా రాబట్టలేకపోయింది. దాంతో ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. 30% శాతం కంటే ఎక్కువగా ఒక డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే గనుక సదరు నిర్మాత డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే అగ్రిమెంట్ ను కొందరు నిర్మాతలు ఫాలో అవుతుంటారు. ఇదే తరహాలో “కవచం” సినిమాకి కూడా తాము నష్టపోయిన మొత్తంలో సాగమైనా వెనక్కి వస్తుందనుకుని డైరెక్ట్ గా బెల్లంకొండ సురేష్ ని అడిగారట. దాంతో సదరు డిస్ట్రిబ్యూటర్ తో బెల్లంకొండ సురేష్ గొడవపడడమే కాక కొట్టినంత పనిచేశాడట.

అయితే.. ఈ విషయమై సురేష్ ను సంప్రదిస్తే గొడవ జరిగిన మాట వాస్తవమే కానీ చెయ్యి చేసుకోవడం అనేది మాత్రం జరగలేదని చెబుతున్నప్పటికీ.. మేటర్ మాత్రం సీరియస్ అని స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కి రావాలని అందరూ కోరుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus