ఆ రోజులు తలుచుకుంటే చాలా భయమేస్తుంది..!

  • August 9, 2020 / 06:02 PM IST

నందమూరి బాలకృష్ణ – కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రాణా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది భాగ్య శ్రీ. 1998 లో ఈ చిత్రం విడుదలయ్యింది. అయితే ఎందుకో మళ్ళీ తెలుగులో సినిమాల్లో నటించలేదు. మళ్ళీ ఇంతకాలానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.

ఆమె మాట్లాడుతూ… “గతంలో ఒసారి నేను నా భర్త నుండీ విడిపోయాను. ఏడాదిన్నర పాటు నా భర్తకు దూరంగా బ్రతికాను. అప్పటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ నాకు చాలా భయమేస్తుంటుంది. నేను ప్రేమించిన తొలి వ్యక్తి హిమాలయ. అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ మేమిద్దరం విడిపోయిన సందర్భం కూడా ఉంది. ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆయన మళ్లీ నా జీవితంలోకి రారా? నేను మరో వివాహం చేసుకోవాలా? అనే భయాందోళనలకు నేను గురయ్యాను. ఆ రోజులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నాకు టెన్షన్ వస్తూనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది భాగ్య శ్రీ. .

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus