‘నా పేరు సూర్య’ పోటీని తట్టుకోవడానికి భరత్ అనే నేను టీమ్ బెస్ట్ ప్లాన్

  • May 1, 2018 / 08:10 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ జోరుకి అల్లు అర్జున్ బ్రేక్ వేయనున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అతను నటించిన నా పేరు సూర్య మే 4 న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రభావం భరత్ అనే నేను సినిమాపై పడనుంది. దీంతో కలక్షన్స్ తగ్గనున్నాయి. అందుకే కొరటాల శివ టీమ్ మంచి ప్లాన్ వేసింది.

నా పేరు సూర్య విడుదల కానున్న 4వ తేదీ నుంచే భరత్ అనే నేను సినిమాకు అదనంగా కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా కొరటాల, మహేష్ కు ఎంతో ఇష్టమైన హోలీ ఫైట్ సీన్ ను భరత్ అనే నేను సినిమాలో చూపించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల బాక్సాఫీస్ వద్ద సూర్యకు పోటీగా భరత్ మరింత స్ట్రాంగ్ గా నిలబడతాడని, వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని యూనిట్ భావిస్తోంది. భరత్ అనే నేను సినిమా ఇప్పటికే 2 గంటల 53 నిమిషాలుంది. హోలీ ఫైట్ తో పాటు మరో సన్నివేశం జతచేస్తే, నిడివి 3 గంటలు దాటిపోతుంది. అయినా అభిమానులు ఆదరిస్తారనే నమ్మకంతో కొరటాల ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus