వెంటనే సల్మాన్ చిత్రం టైటిల్ ను మార్చాలి..!

  • June 3, 2019 / 12:36 PM IST

మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న సల్మాన్ చిత్రం ‘భారత్’ పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. రంజాన్ కానుకగా జూన్ 5 న విడుదల కాబోతున్న ‘భారత్’ చిత్రాన్ని అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసాడు. ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ కు రీమేక్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, దిశాపఠానీ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రానికి ‘భారత్’ అనే టైటిల్‌ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ.. ఢిల్లీ హైకోర్టులో విపిన్ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

‘భారత్’ అనే పదాన్ని సినిమాకు టైటిల్‌‌గా పెట్టడం సరికాదని, వెంటనే ఈ టైటిల్ ను మార్చాలని విపిన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ అనే పదాన్ని వాడటం చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన చెప్పుకొచ్చాడు. అందులోనూ ఈ చిత్రంలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడం పై విపిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ డైలాగ్‌ను చిత్రం నుండీ వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. మరి దీని ఈ విషయం పై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus