ఆ విషయంలో ‘అశ్వథ్థామ’ కు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి..!

  • January 31, 2020 / 07:24 PM IST

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. ఈరోజు విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ 30 నిమిషాల వరకూ సినిమా విసిగించినప్పటికీ.. ఆ తరువాత నుండీ సినిమా గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక కమర్షియల్ విషయాలకి వద్దాం..! ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మార్నింగ్ షోల బుకింగ్స్ సో సో గా ఉన్నప్పటికీ.. మ్యాట్నీ మరియు ఈవెనింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయని సమాచారం.

ఇక సంక్రాంతి పుంజులైన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు జోరు చాలా వరకూ తగ్గింది. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూసేసారు కాబట్టి.. వాటికి ఇదే లాస్ట్ పవర్ ప్లే అని చెప్పొచ్చు. ఇక ‘డిస్కో రాజా’ డీసెంట్ కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతుంది. దీంతో ‘అశ్వథ్థామ’ కు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి 7.6 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది కాబట్టి.. వీకెండ్ ఓ 50శాతం రికవరీ సాధించే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఎంతవరకూ ‘అశ్వథ్థామ’ ఉపయోగించుకుంటుందో చూడాలి..!

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus