రీ ఎంట్రీ గట్టిగా కొట్టాలి మరి.. ఏం చేస్తారో!

  • November 16, 2019 / 08:41 PM IST

రవితేజ ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ డోస్ కాస్త తక్కువగానే ఉంటుందట. కామెడీ ఉన్నప్పటికీ.. అది రవితేజ మార్క్ కామెడీ కాదని టాక్ వినిపిస్తుంది. మూడు డిజాస్టర్లు పడ్డాయి కాబట్టి వాటి నుండీ బయటపడటానికి ఇదో సేఫ్ గేమ్ గా రవితేజ ఎంచుకున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ‘బలుపు’ తో వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే ఆ స్థాయిలో మళ్ళీ వీళ్ళిద్దరూ హిట్ అందుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘క్రాక్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ‘బలుపు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఈ చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. ఈ ముగ్గురికీ ఈ చిత్రం విజయం సాధించడం చాలా అవసరమనే చెప్పాలి. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం హిట్ కొడితేనే వీళ్ళు మళ్ళీ బిజీ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. సో వీళ్ళకి పెద్ద పరీక్షనే చెప్పాలి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus