సరికొత్త వ్యూహంతో ‘బిగ్ బాస్’ షో!!

  • July 21, 2017 / 07:40 AM IST

టాలీవుడ్ ను శాసిస్తున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు…అందం నుంచి అభినయం వరకూ…ఎక్కడ పేరు పెట్టడానికి లేని అతి కొద్ది మంది హీరోలో ఎన్టీఆర్ ఒకరు…అయితే అదే ఎన్టీఆర్ టాలీవుడ్ లో వరుస హిట్స్ కొడుతూనే బుల్లి తెరపై ‘బిగ్ బాస్’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు…అయితే ఈ షో కి ఉన్న హైప్…ఈ షో కి వచ్చిన క్రేజ్ కి ఏమాత్రం సంభంధం లేకుండా సాగుతుంది బిగ్ బాస్…రేటింగ్స్ విషయంలో మిగిలిన షోస్ తో పోలిస్తే బాగానే ఉన్నా…ఈ షో మాత్రం పెద్దగా ఆసక్తిగా అనిపించడంలేదు అన్న టాక్ వినిపిస్తుంది…దానికి కారణం ఈ షోలో పెద్ద ఫేమస్ అయిన నటీనటులు లేకపోవడం, ఎన్టీఆర్ కోసం తప్ప వేరే ఎవరి కోసం ఈ షో చూడాలి అన్న న్యూస్ హల్‌చల్ చెయ్యడం..ఇలా రకరకాల కారణాల వల్ల ఈ షో అనుకున్నంత హిట్ కాలేదు అని తెలుస్తుంది..అయితే ఇక్కడే కాదు…వాస్తవానికి ‘బిగ్ బాస్’ హిందీ షోకు తప్పించి మిగతా దక్షిణాది భాషలలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తమిళంలో కమలహాసన్ కన్నడంలో ఉపేంద్ర ఈషోను పెద్దగా రక్తి కట్టించలేకపోయారు.

ఇప్పుడు అదే బాటలో జూనియర్ ‘బిగ్ బాస్’ కూడా నడుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎలా అయినా ఈ షో ని క్రేజ్ కి తగ్గట్లుగా మార్చాలి అన్న ఆలోచనలో సరికొత్త వ్యూహాన్ని రచించనున్నారు మన మా టీమ్…దానిలో భాగంగానే….తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్’ షోకు రేటింగ్స్ పెరగడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉపాయాన్ని ఆలోచిస్తున్నారని టాక్. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషో క్రేజ్ పెంచడానికి అనసూయ – రష్మీ – మంచు లక్ష్మి – తేజస్వి లలో ఎవరో ఒక ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ షోలో ప్రవేశపెట్టి ఈషో క్రేజ్ ను పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే నిజం అయితే…కనీసం వాళ్ళ కోసం అయినా ఈ షో కి టీఆర్‌పీ పెరిగే అవకాశం తప్పకుండా వస్తుంది అని అనుకోవచ్చు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus