Bipasha Basu: అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన బిపాసా బసు..!

  • November 13, 2022 / 08:19 AM IST

ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో ఈమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు.పైగా ఈమె పారితోషికం కూడా ఆ టైంలో బాగా ఎక్కువగా ఉండేది. కాబట్టి దర్శక నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అవును బిపాసా – కరణ్ సింగ్ దంపతులకు పండంటి ఆడ పిల్ల జన్మించింది. ఈ దంపతులకు 2016 లో పెళ్లైంది. 6 ఏళ్ళ తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు అయ్యారని తెలుస్తోంది. మరో బాలీవుడ్ కపుల్ అలియా – రణబీర్ కపూర్ లకు కూడా ఇటీవల ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఇక బిపాసా గర్భిణి గా ఉన్న టైంలో… అర్ధనగ్నంగా తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి సంచలనం సృష్టించింది.

ఆ ఫోటోలో ఆమె భర్తతో కూడా ఉండగా అతను ఆమె ప్రైవేట్ పార్ట్ పై చేయేసి ఉన్న ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఇక బిపాసా తల్లైన సందర్భంగా నెటిజన్లు ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus