పవన్, క్రిష్ సినిమా… ఆసక్తిని పెంచే అప్డేట్ ఇదిగో..!

  • February 27, 2020 / 08:32 AM IST

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఇప్పటికే ‘పవన్ 26’ అయిన ‘పింక్’ రీమేక్ 70 శాతం పూర్తయ్యింది. ఇక క్రిష్ డైరెక్షన్ లో చేస్తోన్న పవన్ 27 కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అల్యూమీనియం ఫ్యాక్టరీ లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు కీర్తి సురేష్ లు హీరోయిన్ లుగా నటించబోతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో విలన్ గా ఓ బాలీవుడ్ హీరోని దర్శకుడు క్రిష్ ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది. అందుతోన్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ను పవన్ 27 లో విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈయన సుపరిచితుడే. ‘ఫ్యామిలీ వాలా’ ‘డాన్2’ ‘ఓం శాంతి ఓం’ చిత్రాల్లో నటించాడు అర్జున్. ఇక పవన్ 27 లో ఈయనది చాలా పవర్ ఫుల్ రోల్ అట. అందుకే క్రిష్ అడిగిన వెంటనే అర్జున్ రాంపాల్ ఓకే చెప్పేసినట్టు సమాచారం.దీంతో హిందీలో అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చేసే దిశగా షూటింగ్ జరుపుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus