రెండో కొడుకు కోసం బ్రహ్మీ ప్లాన్!

  • January 29, 2021 / 05:05 PM IST

టాలీవుడ్ లో స్టార్ కండియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన నటవారసుడిగా 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ అనే సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్ ని హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో గౌతమ్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘వారెవా’, ‘మను’ చిత్రాలలో నటించాడు. ఈ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

దీంతో గౌతమ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బ్రహ్మానందం రెండో కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రహ్మీ రెండో కొడుకు సిద్ధార్థ్ మొదటి నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సిద్ధార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగొచ్చాడు. ఇప్పుడు అతడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు బ్రహ్మీ.

అయితే మొదటి కొడుకు గౌతమ్ ఇండస్ట్రీలో రాణించకపోవడంతో రెండో కొడుకు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. మరి సిద్ధార్థ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus