ఆ బాలీవుడ్ భామకు కోర్టు నోటీసులు

  • July 1, 2019 / 05:44 PM IST

పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘బద్రి’ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయ్యింది బాలీవుడ్ భామ అమీషాపటేల్. అటుతరువాత మహేష్ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు చిత్రాలు ప్లాపవ్వడం తో తెలుగులో ఆమెకు ఆఫర్లు రాలేదు. తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని బాలయ్య హీరోగా వచ్చిన ‘పరమవీరచక్ర’ చిత్రంలో నటించినా ఆ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో మళ్ళీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అడపా దాడపా సినిమాలు చేస్తూ కలం గడుపుతుంది. అంతేకాదు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతో యాక్టివ్ గా గడుపుతుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ భామ ఓ కేసులో ఇరుక్కుందట. ఓ ఫైనాన్షియర్ వద్ద మూడు కోట్లు తీసుకుని ఎగ్గొట్టిందని కేసు నమోదవ్వడంతో ఈమెకు కోర్టు నోటీసులు పంపింది. చెక్ బౌన్స్ కేసు కూడా ఇందులో లింక్ అయ్యుండడంతో అమీషా పీకల్లోతు ఇబ్బందుల్లో పడింది. ఓ సినిమా కథ నచ్చడంతో… తనే నిర్మాతగా మారి సినిమా నిర్మించాలని అమీషా.. అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి నుండీ మూడు కోట్ల రూపాయలు అప్పు తీసుకుందట. అయితే కారణమేంటో తెలీదు కానీ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియర్ నుండీ ఒత్తిడి ఎక్కువయ్యిందట.

దీంతో అతనికి చెక్ ఇచ్చినప్పటికీ అది బౌన్స్ అవ్వడంతో .. ఆ ఫైనాన్షియర్ ఈమె పై కేసు పెట్టాడు. రాంచీ కోర్టులో ఈ కేసు నమోదయ్యింది. ఈ నెల 8న అమీషా కోర్టుకి హాజరు కావాల్సి ఉంది. లేదంటే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. ‘నాకు రావాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని.. ఇప్పుడు చెల్లించకపోతే ఎప్పటిలోపు చెల్లిస్తారో బాండ్ రాసివ్వాలి. ఈ విషయంపై స్పష్టత కోరిన ప్రతీసారి అమీషా తప్పించుకొని తిరుగుతుంది’ ‘ అంటూ అజయ్ కుమార్ సింగ్ (ఫైనాన్సియర్) ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. అయితే ‘నేనెక్కడికీ పారిపోలేదని.. ముంబైలోనే ఉన్నానని’ అమీషా చెప్పుకొస్తుంది. మరి కోర్టు ఈ కేసు పై ఎటువంటి తీర్పునిస్తుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus