చల్ మోహన్ రంగ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్.!

  • March 23, 2018 / 09:34 AM IST

నితిన్ గత చిత్రం లై విజయం సాధించలేదు. అందులో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ ని ఎవరైనా రెండోసారి పక్కన పెడుతారు. కానీ నితిన్ ఆమెతోనే మరో సారి జతకట్టారు. వారిద్దరి కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం “చల్ మోహన్ రంగ”. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించారు. శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ‌లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం.

దీనిని కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి యువతని విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 5 న రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఈ నెల 25న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు జనసేనాని పవన్‌ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ప్రీ రిలీజ్‌ వేడుకకు అంతా రెడీ అయింది. ఈవెంట్‌కు మై ప్రొడ్యూసర్ అండ్ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.” అని నితిన్ ట్వీట్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus