నాగార్జున నిర్మాణంలో చేయనున్న మూవీపై డైరక్టర్ చందు వివరణ
December 30, 2016 / 01:48 PM IST
|Follow Us
యువ దర్శకుడు చందు మొండేటి కార్తికేయ మూవీతో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. నిఖిల్ ని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్ తో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత యువ సామ్రాట్ నాగచైతన్యని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో అద్భుతంగా తెరకెక్కించి కింగ్ నాగార్జున తో అభినందనలు అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమా అవకాశం దక్కించుకున్నారు. నిఖిల్ హీరోగా నాగ్ నిర్మించున్న ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికీ అడ్డుకట్ట వేయాలని డైరక్టర్ చందు మొండేటి స్పందించారు.
చిత్ర వివరాలను వెల్లడించారు. “అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమా చేసేందుకు ఒక కథ అనుకున్నాం. కథ చర్చలు సాగుతున్నాయి. ఇంకా ఏ విషయం ఫైనల్ కాలేదు. ఒకే అయిన వెంటనే వివరిస్తాను” అని వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున తన బ్యానర్లో ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 2 తీస్తున్నారు. దీని తర్వాత చందు మొండేటి సినిమా ఉండవచ్చని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.