వాటిని నమ్మొద్దంటున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత..!

  • September 3, 2019 / 07:10 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బడా స్టార్ హీరోలైన చరణ్,ఎన్టీఆర్ లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ చిత్ర నిర్మాత అయిన డీవీవీ దానయ్య తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇందులో భాగంగా తన సోషల్ మీడియా ఖాతా అయిన ‘డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఆదివారం నాడు ట్వీట్లు చేశారు. ‘నిజంగా నూతన నటులు కావాలంటే మేమే నేరుగా అధికారిక ప్రకటన ఇస్తాం.కొంతమంది అపరిచితులు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌మీడియా ఖాతాలు నడుపుతూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది. ‘ఆర్.ఆర్‌.ఆర్‌’ సినిమాకు క్యాస్టింగ్‌ కాల్స్‌ అంటూ ఫేక్‌ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి. ‘ అంటూ పోస్ట్‌ చేశారు.

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో జరుగుతుందని… అక్కడ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు.. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వెల్లడించింది. ఇక మరోపక్క చరణ్ కూడా యాక్షన్ సన్నివేశాల కోసం కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలిపింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇక చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus