Chiranjeevi: మరో క్రేజీ మల్టీస్టారర్ కు రంగం సిద్దమైనట్టే..!

  • April 29, 2021 / 02:12 PM IST

టాలీవుడ్లో మ‌ల్టీస్టార‌ర్ల హవా ఎక్కువవుతుంది.రాజమౌళి పుణ్యమా అని ‘బాహుబలి'(సిరీస్) తరువాత పాన్ ఇండియా సినిమాలు ఎలా ఎక్కువయ్యాయో.. అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత మల్టీస్టారర్ల జోరు కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మల్టీ స్టారర్ ట్రెండ్ ను మొదలు పెట్టింది మాత్రం వెంకటేష్, మహేష్ బాబులే.. అయినప్పటికీ అవి ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్, వెంకీ లు ‘ఎఫ్2’ లో నటించిన తరువాత ‘ఎఫ్3’ లో కూడా కలిసి నటిస్తున్నారు.

మరోపక్క పవన్ కళ్యాణ్,రానా లు కూడా ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియం'(మలయాళం) రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో బడా మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మల్టీస్టారర్ లో చిరు,నాగార్జున లు కలిసి నటించబోతున్నారు అని సమాచారం. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్లో సూప‌ర్ హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద’ తెలుగులో రీమేక్లో నటించడానికి చిరు, నాగ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అక్కడ మాద‌వ‌న్ పాత్రలో నాగార్జున, విజయ్ సేతుప‌తి పాత్రలో చిరు కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది.

గతంలో కూడా ఈ రీమేక్ కు సంబంధించి ఎన్నో కథనాలు వినిపించాయి.ఓసారి ప‌వ‌న్ కళ్యాణ్ – ర‌వితేజ‌, మరోసారి వెంక‌టేష్ -నారా రోహిత్ లు ఈ రీమేక్ లో నటిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈసారి ఓ అగ్ర దర్శకుడు వీరితో ఎలాగైనా ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యి స్క్రిప్ట్ రెడీ చేసి దానిని వీరికి వినిపించి ఓకే చేయించుకున్నాడు అని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus