భరత్ అనే నేనుకి కనెక్ట్ అయిపోయా : చిరంజీవి

  • May 2, 2018 / 02:07 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను మెగాస్టార్ చిరంజీవి తప్పక చూస్తుంటారు. వెంటనే ఫోన్ చేసి మహేష్ తో ఆ సినిమాలో నచ్చిన విషయాల గురించి మాట్లాడుతారు. పోకిరి సినిమా సమయంలో అయితే స్వయంగా కలిసి అభినందించారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను సినిమాని చూసారు. అందులో నచ్చిన విషయాలను మహేష్ తోనే కాదు మీడియాతోను పంచుకున్నారు. రీసెంట్ గా అమెరికా వెళ్లిన చిరు అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ.. “భరత్‌ అనే నేను”  సినిమా గురించి కూడా ప్రస్తావించారు. “మా కుటుంబ సభ్యులకు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం. ‘భరత్‌ అనే నేను’ను తొలిరోజున మా ఇంట్లోనే చూశాం.

కమర్షియల్‌ హంగుల కోసం దర్శక, నిర్మాతలు కథని పక్కదారి పట్టించలేదు. ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. మహేశ్‌కు ఫోన్‌ చేసి నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నా” అని అన్నారు. ఇంకా సినిమాలో నుంచి సీన్ గురించి కూడా మాట్లాడారు. “సినిమా చివర్లో వచ్చే విలేకరుల సమావేశం సన్నివేశం బాగుంది. నేను స్వతహాగా ఆ సన్నివేశానికి కనెక్ట్‌ అయిపోయి.. మహేశ్‌ జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టా. సినిమాలో అది అత్యద్భుతమైన సీన్” అని చిరు ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus