డాన్స్ మాస్టర్ తో సినిమా చేయాలనుకున్నాడట!

  • December 23, 2020 / 04:42 PM IST

కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మా రాజశేఖర్ దర్శకుడిగా మారి సినిమాలు చేశాడు. గోపీచంద్ హీరోగా అతడు తీసిన తొలి సినిమా ‘రణం’ అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. రాజశేఖర్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ ఆ తరువాత ఆయన తీసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఓ హిందీ సినిమాను కాపీ కొట్టి రవితేజతో తీసిన ‘ఖతర్నాక్’ పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో అవకాశాలు లేక కొరియోగ్రఫీ కూడా మానేశాడు. మధ్యమధ్యలో కొన్ని డాన్స్ షోలలో కనిపించడం తప్పితే లైమ్ లైట్లో లేకుండా పోయారు.

ఈ ఏడాది బిగ్ బాస్ షోలో పాల్గొని కాస్త పాపులారిటీ పెంచుకున్నాడు. ఈ షోలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రాజశేఖర్ గురించి గ్రాండ్ ఫినాలే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ సంచలన విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘రణం’ సినిమా చేయడానికి చాలా ఏళ్ల ముందే రాజశేఖర్ లో ఓ దర్శకుడు ఉన్నాడని తాను గుర్తించానని.. తనతో సినిమా చేయమని రూ.15 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చానని చిరు వెల్లడించారు. చిరు చెప్పినంత వరకు రాజశేఖర్ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. చిరు ప్రస్తావించిన సమయంలో అవునని బదులిచ్చాడు.

అడ్వాన్స్ తీసుకున్న రాజశేఖర్ తనతో సినిమా మాత్రం చేయలేదని చిరు చెప్పగా.. అప్పట్లో అమ్మ ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఇంట్లో సమస్యల వలన చేయలేకపోయానని.. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే సినిమా తీస్తానని అన్నాడు. దానికి చిరు బదులిస్తూ.. ఈసారి అడ్వాన్స్ ఇవ్వనని.. అప్పుడు ఇచ్చిన దానికి వడ్డీ కలిపితే కోట్లు అవుతుందని.. అదే పారితోషికంగా తీసుకొని తనతో సినిమా చేయమని చెప్పడం విశేషం. ఇదంతా సరదాగా మాట్లాడారనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు..అమ్మా రాజశేఖర్ కి ఛాన్స్ ఇస్తాడా అనేది డౌటే!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus