Chiranjeevi: చిరంజీవి నిర్ణయం వల్ల కూతురికి ఎన్నికోట్లు నష్టమో తెలుసా..!

  • October 3, 2023 / 07:32 PM IST

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి నేటి తరం స్టార్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 6 పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ ఆయన అభిమానులను గర్వంగా ఫీల్ అయ్యేలా చెయ్యడం ఆషామాషీ విషయం కాదు. అయితే అభిమానులకు చేదు జ్ఞాపకాలు మిగిలేలా చేసిన ‘ఆచార్య’ మరియు ‘భోళా శంకర్’ వంటి సినిమాలను కూడా చేసాడు మెగాస్టార్.

ఈ రెండు చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో చిరు ఇక స్క్రిప్ట్ సెలక్షన్ మీద ప్రత్యేక ద్రుష్టి సారించాడు. అందులో భాగంగా రీమేక్ సినిమాలకు నో చెప్పడం ప్రారంభించాడు. అలాగే కథ కాస్త తేడాగా అనిపించినా కూడా వెంటనే నో చెప్పడం నేర్చుకున్నాడు. అది సొంత కూతురు అయినా సరే ఈ విషయం లో ఆయన తగ్గడం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి (Chiranjeevi) కుమార్తె సుస్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ లో మెగాస్టార్ చిరంజీవి ని హీరో గా పెట్టి ఒక సినిమా చేద్దామని అనుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. చిరంజీవి తో పాటుగా మరో యంగ్ హీరో కూడా ఈ చిత్రం లో నటించడానికి స్కోప్ ఉంది. అయితే ఎందుకో చిరంజీవి కి ఈ కథ వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం రాకపోవడం తో, రీసెంట్ గానే సుస్మిత ని ఇంటికి పిలిచి సినిమాని ఆపి వెయ్యాల్సిందిగా చెప్పాడట.

అయ్యో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించాము, కోటి రూపాయలకు పైగానే ఖర్చు అయ్యింది అని చెప్తే, ఇప్పుడైతే కోటి రూపాయలతో పోయింది, ఈ సినిమా చేస్తే కోట్లలో నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. వేరే ప్రాజెక్ట్ చేద్దాం, ఇది మాత్రం వద్దు అని చెప్పాడట, దీంతో ఈ ప్రాజెక్ట్ ని సుస్మిత ఆపేయాల్సి వచ్చింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus