MAA Elections: ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద చిరంజీవికి నమ్మకం సన్నగిల్లిందా ?

  • October 6, 2021 / 07:46 PM IST

10వ తారీఖున జరగనున్న మా ఎలక్షన్స్ విషయంలో రోజురోజుకీ రచ్చ పెరుగుతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు & ప్రకాష్ రాజ్ ప్యానల్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే కాదు, మీడియాకెక్కి నానా హడావుడి చేస్తున్నారు. అయితే.. ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఏడాది మా ఎలక్షన్స్ కేవలం రెండు ప్యానల్స్ మధ్య కాదు.. రెండు కులాలు, రెండు వర్గాల మధ్య అని. విష్ణు ప్యానల్ కి ఒక వర్గం సపోర్ట్ చేస్తుంటే..

ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మరో వర్గం సపోర్ట్ చేస్తుంది. ప్రకాష్ రాజ్ & ప్యానల్ కు వర్గం సపోర్ట్ మాత్రమే కాక మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా పుష్కలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు వచ్చి ఎన్నికలు జరుగుతున్న తీరుకు కన్నీరు పెట్టగా.. మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి అందర్నీ కడిగి పాడేశాడు. ఇదంతా చూసిన మెగాస్టార్ చిరంజీవి..

ఈ ఎలక్షన్స్ ను లైట్ తీసుకోమని తమ బృందానికి ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. తన ఫ్యామిలీ హీరోస్ & మెగా క్యాంప్ నటీనటులు. దర్శకనిర్మాతలను ఓటు వేసి సైలెంట్ గా ఉండండి కానీ.. మీడియా ముందుకు మాత్రం వెళ్ళకండి అని చెప్పారట. ఇకపోతే.. సీనియర్ యాక్టర్స్ అందరూ మంచు విష్ణు ప్యానల్ కి సపోర్ట్ ప్రకటించడంతో.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుందన్న నమ్మకం సన్నగిల్లినట్లు సమాచారం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus