Chiranjeevi: బాధితులకు అండగా నిలవండి… విజ్ఞప్తి చేసిన చిరు!

  • June 3, 2023 / 03:36 PM IST

ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో వందల మంది తీవ్ర గాయాలు పాలు కాగా దాదాపు 200 లకు పైగా మరణాలు సంభవించాయని తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తో పాటు మరో ఎక్స్ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీ కొట్టిన ఘటనలో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది. ఇలా సూపర్ ఫాస్ట్ రైళ్లు ఢీ కొట్టు కోవడంతో భారీగా మరణాలు సంభవించాయని తెలుస్తుంది.

అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది స్పందించి సహాయ చర్యలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు కూడా స్పందిస్తూ తమ అభిమానులకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. చిరంజీవి ఈ రైలు ప్రమాద ఘటనపై స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 900కు పైగా గాయపడ్డారని తెలుస్తుంది.

అయితే వీరందరికీ రక్తం అవసరం కావడంతో రక్త యూనిట్లను దానం చేయాలి అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోని ఈయన ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఒడిశాలు జరిగిన రైలు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.

మృతుల కుటుంబాలకు (Chiranjeevi) నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలను కాపాడటం కోసం తక్షణమే రక్త యూనిట్లు డిమాండ్ ఉందని నేను అర్థం చేసుకున్నాను.సాధ్యమైనంత తొందరగా వెంటనే రక్త యూనిట్లు అందించాలని ఈయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus