Chiranjeevi, Nagarjuna: చిరు వద్దంటే.. నాగార్జున ఒప్పుకున్నారు!

  • September 17, 2022 / 11:38 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.. ఏ సినిమా హిట్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ చేయించాలని అక్కడి వర్గాలు భావిస్తున్నారు.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అందుకే హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బజ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో డీల్ కోసం మెగాస్టార్ ని సంప్రదించగా.. ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. ముందు తెలుగులో రిలీజ్ అయిన తరువాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తానని మెగాస్టార్ అన్నారట. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ సైలెంట్ అయిపోయారట. మరికొందరు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ని హిందీలో రిలీజ్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనికి ‘ది ఘోస్ట్’ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

నాగార్జున ఇదివరకు బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేశారు. కానీ పేరు తెచ్చుకోలేకపోయారు. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగ్ గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడం, నాగార్జున రోల్ పండడంతో ‘ది ఘోస్ట్’ సినిమాకి బాలీవుడ్ లో మంచి బజ్ రావడం ఖాయం.

‘పుష్ప’ సినిమాను హిందీలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ‘ది ఘోస్ట్’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ విధంగా మెగాస్టార్ బాలీవుడ్ రిలీజ్ కి నో చెబితే.. నాగార్జున ఓకే చేసి.. తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నారు. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus