‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్..?

  • April 23, 2019 / 10:11 AM IST

నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. టి.ఎన్. సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రం పై నిఖిల్ చాలా అసలే పెట్టుకున్నాడు. ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ క్రేజ్ ను ఏర్పరుచుకున్నారు నిఖిల్. యూత్ కి నచ్చేలా వైవిధ్యమైన కథలను ఏఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘అర్జున్ సురవరం’ చిత్రం మే 1న విడుదలకు సిద్దమవుతుంది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. విడుదలైన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్ లో నిర్వహించబోతున్నారని సమాచారం. ఇప్పటికే నిఖిల్ పలు టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ టైం వచ్చింది. ఈ చిత్ర నిర్మాత అయిన ఠాగూర్ మధుకి మెగాస్టార్ చిరంజీవికి మంచి సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. దీంతో మెగాస్టార్ ని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నాడట. ‘సైరా’ చిత్రం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నప్పటికీ కొంచెం గ్యాప్ తీసుకుని ఈ ఈవెంట్ కి రావడానికి ఓకే చెప్పాడట. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus