పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు, డిబేట్లా.. అసలు మ్యాటర్ ఏంటి?

  • November 17, 2020 / 01:07 PM IST

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు ఎంత గొప్ప లిరిసిస్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సాహిత్యం మనల్ని ఎంతో ఉల్లసించేలా చెయ్యడమే కాకుండా మనలని ఆలోచింప చేసేలా కూడా చేస్తుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ విషయాన్ని తనదైన శైలిలో ఎప్పుడో చెప్పుకొచ్చారు. ఆ మాటలను మనం ఎప్పటికీ మరచిపోలేము. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. ఈమధ్యనే సిరివెన్నెల గారి కుమారుడు రాజా వివాహం వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందుతో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం గమనార్హం.

అయితే ఇది సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు.. కంగారు పడకండి. దీపావ‌ళి రోజున వీరిద్దరూ కలిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజా మాట్లాడుతూ…”పెళ్లయ్యాక ఓసారి ల‌క్ష్మి అని తనని(రాజా భార్యను) పిలుస్తుంటే ఎవ‌ర్నో అనుకుని ఆమె ప‌ట్టించుకోకుండా వెళ్లేపోయేది.పెళ్లి కాక ముందు ఆమెని అంద‌రూ బిందు అనే పిలిచేవాళ్ళంట. అయితే నాకు ఆ విష‌యం తెలీక ఆమె పేరులోని ల‌క్ష్మితో పిలిచాను. నాకు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆరా తీసాను. వెంక‌ట‌ల‌క్ష్మి హిమ‌బిందులోని ఆమె పూర్తి పేరులో బిందు అనే దానికే ఆమె ఎక్కువ రెస్పాండ్ అయ్యేదని చెప్పింది.

అయితే మా ఇంట్లో అంతా ఆమెను లక్ష్మీ అనే పిలుస్తున్నారు.మా ఫ్యామిలీలో ఆమె బాగా కలిసిపోయింది. ఇక నాకు యాక్టింగ్‌ తర్వాత ఫిట్‌నెస్ మెయింటైన్ చెయ్యడం చాలా ఇష్టం. కాబట్టి నేను నా భార్యకి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తున్నాను. దీనివల్ల ఇంట్లో గొడ‌వ‌లు, డిబేట్లు వస్తున్నాయి. తనని ఏమీ తినకుండా చేసేస్తున్నాను అని మా ఫ్యామిలీ మెంబెర్స్ నన్ను సరదాగా మందలించారు” అంటూ చెప్పుకొచ్చాడు రాజా.

1

2

3

4

5

6

7


Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus