‘ప్రభాస్ 21’ లేటెస్ట్ అప్డేట్… అలా అయితే పండగే…!

  • May 2, 2020 / 01:55 PM IST

బాహుబలి(సిరీస్) తర్వాత ప్రభాస్ వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. పెద్ద బడ్జెట్ సినిమాలు కావడంతో విదేశాల్లోనే ఎక్కువ చిత్రీకరణ చెయ్యాల్సి వస్తుంది. దీంతో సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ … రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న చిత్రం కూడా ఎక్కువగా విదేశాల్లోనే చిత్రీకరణ ప్లాన్ చేసారు. 20 శాతం షూటింగ్ ఫినిష్ అయ్యింది. మిగతా షూటింగ్ ను మాత్రం ఇక్కడే రామోజీ ఫిలింసిటీలో సెట్లు వేసి ఫినిష్ చెయ్యాలి అని భావిస్తున్నారట.

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఓ మహమ్మారి వల్ల వణికిపోతుంది కాబట్టి ఇక్కడే చిత్రీకరణ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ప్రభాస్ 21′ గురించి కూడా ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఫిలింనగర్లో హల్ చల్ చేస్తుంది.’ప్రభాస్ 21’ వ చిత్రం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందనున్న సంగతి తెలిసిందే. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందట. చాలా సంతృప్తికరంగా స్క్రిప్ట్ వచ్చిందని తెలుస్తుంది.

దాంతో ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ ను లాక్ డౌన్ పూర్తయిన వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ చిత్రం షూటింగ్ కూడా ఆర్.ఎఫ్.సి లో సెట్లు వేసి ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయట. దీంతో ‘ప్రభాస్ 21’ కూడా త్వరగా ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలా జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus