సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్!

  • April 23, 2023 / 06:35 AM IST

బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల తెలుగు కమెడియన్ అల్లు రమేష్ రెండు రోజుల క్రితమే గుండె పోటుతో మరణించారు. మాలీవుడ్ పరిశ్రమ నుండి రెండు మరణ వార్తలు వినిపించాయి. వారిలో ఒకరు మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మరో కొరియోగ్రాఫ్ మృతి చెందాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల తెలుగు కమెడియన్ అల్లు రమేష్ రెండు రోజుల క్రితమే గుండె పోటుతో మరణించారు.

అలాగే అటు బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా భార్య, సింగర్ కమ్ నిర్మాత పమేలా చోప్రా అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అంతలోనే మాలీవుడ్ పరిశ్రమ నుండి రెండు మరణ వార్తలు వినిపించాయి. వారిలో ఒకరు మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తాజాగా మరొకరు మరణించారు. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ కన్నుమూశారు. అయితే అతడు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సౌత్‌ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్‌ మాస్టర్‌కు మంచి పేరు ఉంది. పలు సినిమాలకు ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు.

అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేష్‌ మాస్టర్‌ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌ మాస్టర్‌ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus