రజినీ మానియా స్టార్ట్ అయ్యింది..!

  • January 9, 2020 / 05:11 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జనవరి 9న) విడుదలయ్యింది. అయితే గత రాత్రి నుండే ‘దర్బార్’ ప్రీమియర్ షోలు యూఎస్ లో ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తుండడంతో బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇక యూస్ ప్రీమియర్ షో ల ద్వారా ‘దర్బార్’ చిత్రం తమిళ వెర్షన్ కు 4 లక్షల డాలర్లు వరకూ వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే నైట్ షో ల వరకూ ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే అన్ని భాషలు కలుపుకుంటే ఈ లెక్క పెద్దగానే ఉంటుంది. వన్ మిలియన్ పైనే వసూళ్ళు ఉండచ్చు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా బాగున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 3 నుండీ 4 కోట్ల వరకూ షేర్ ను.. మొదటి రోజు ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలుగులో ‘దర్బార్’ చిత్రాన్ని 14.2 కోట్లకు అమ్మారు చిత్ర నిర్మాతలు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus