సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో అజిత్!

  • January 18, 2018 / 04:32 AM IST

భారీ అంచనాల నడుమ విడుదలైన అజిత్ “వివేగం” (తెలుగులో “వివేకం”) ఫ్లాప్ అవ్వడమే కాక అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలిచింది. హాలీవుడ్ స్థాయి కథ-కథనాలతోపాటు అదే స్థాయి నిర్మాణ విలువలతోనూ తెరకెక్కిన “వివేగం” టీజర్ మొదలుకొని పాటల వరకూ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి భారీ అంచనాలతో రిలీజైన చిత్రం ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్లు రెస్ట్ తీసుకొన్న అజిత్ తనకు బాగా అచ్చొచ్చిన రూరల్ మాస్ సినిమా ఒకటి తీయాలని ఫిక్స్ అయ్యి.. “వివేగం” దర్శకుడు శివకే మరో అవకాశం ఇచ్చాడు. “విశ్వాసం” టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలవ్వనుంది.

ఈ సినిమా తర్వాత అజిత్ తన ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో కలిసి వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. అజిత్-గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వచ్చిన “ఎన్నై ఆరిందాల్” (తెలుగులో “ఎంతవాడుగానీ”) ఏ స్థాయిలో హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అజిత్ స్టైల్, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీటవుతుందని తెలియగానే అజిత్ అభిమానులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తుతం ధనుష్, విక్రమ్ సినిమాలతో బిజీగా ఉన్న గౌతమ్ మీనన్ ఆ సినిమాలు పూర్తవ్వగానే అజిత్ సినిమా మొదలెడతాడట. ఇకపోతే.. అజిత్ తో తెరకెక్కించబోయే సినిమా “ఎంతవాడు గానీ”కి సీక్వెల్ అని టాక్. అదేగనుక నిజమైతే వారి కాంబినేషన్ లో మరో థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus