Dhanush: ధనుష్ ‘రుద్ర’లో నాగార్జునను తీసేశారట!

  • January 5, 2023 / 04:56 PM IST

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు ధనుష్. నటించడం మాత్రమే కాకుండా.. సింగర్ గా, లిరిసిస్ట్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా తన టాలెంట్ చాటుకున్నారు. ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా తన అభిరుచి చాటుకున్నారు. సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. యంగ్ రాజ్ కిరణ్ క్యారెక్టర్ లో ధనుష్ స్వయంగా నటించారు. ఈ సినిమా తరువాత దర్శకుడిగా మరి సినిమా చేయాలనుకున్నారు.

అదే ‘రుద్ర’. దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకున్నారు. తనే ముఖ్య పాత్ర పోషిస్తూ.. నాగార్జున, అరవింద్ స్వామి లాంటి సీనియర్ నటులను కీలకపాత్ర కోసం ఎన్నుకున్నారు. ఇక షూటింగ్ కి వెళ్లడమే ఆలస్యమనుకున్న సమయంలో.. సడెన్ గా సినిమాకి బ్రేక్ పడింది. బడ్జెట్ సమస్యల వలన సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కొన్నేళ్లపాటు ధనుష్ దర్శకత్వం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను బయటకు తీస్తున్నారట.

ధనుష్ అడిగినంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి సన్ పిక్చర్స్ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. కాకపోతే ఈసారి క్యాస్టింగ్ మొత్తం మారిపోతుందట. ముందుగా అనుకున్నట్లు నాగార్జున, అరవింద్ స్వామి కాకుండా వేరే నటులను తీసుకోబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఎస్ జె సూర్య, విష్ణు విశాల్ లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ధనుష్ కూడా నటిస్తారట. కథను కూడా కొంచెం మార్చి కొత్త టైటిల్ తో రంగంలోకి దిగనున్నారు ధనుష్.

త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే తెలుగులో ‘సార్’ అనే సినిమా చేస్తున్నారు. దీని తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus