‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు..!

  • October 6, 2019 / 04:37 PM IST

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఓ పక్క పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు తనకి నచ్చిన చిన్న సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఓ చిన్న సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ ఓ చిన్న సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే.. అది కచ్చితంగా మంచి సినిమానే అయ్యుంటుంది అని అంతా ఫిక్సయిపోయారు. ‘బాహుబలి 2’ ఫేమ్ రాహుల్ వర్రే హీరోగా నటిస్తున్న ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన కామెంట్స్ పెద్ద సంచలనం అవుతున్నాయి.

దిల్ రాజు మాట్లాడుతూ… ” ‘జోష్’ సినిమాకి కొత్త వాళ్ళు కావాలి అని రాకేష్ ను సెలెక్ట్ చేసుకున్నాం. కానీ తెలిసిన వాళ్ళ అబ్బాయి కదా.. ‘మంచిగా చదువుకున్నావు. మంచి ఫ్యూచర్ ఉంది.. ఇండస్ట్రీకి రావొద్దు’ అని నేను చెప్పిన రాకేష్ వినలేదు. అబ్రాడ్ లో జాబ్ వదులుకుని మరీ సినీ ఫీల్డ్ లోకి వచ్చాడు. నేను అలా ఎందుకు చెప్పాను అంటే.. ఇండస్ట్రీలో సక్సెస్ అయినవాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఫెయిల్యూర్ వస్తే వెనుకాలే ఉండి పోతారు. సినిమా తీసే వాళ్ళు అంతా.. ‘మేము తోపు సినిమా తీసేసాము’ అనుకుని ఫీలవుతారు. కానీ 100 రూపాయలు పెట్టి తోపు సినిమా తీసారా.. ప్లాపు సినిమా తీసారా అని డిసైడ్ చేసేది మీరే. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా..! కచ్చితంగా ఈ చిత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus